Header Banner

గుడ్న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్.. వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు, రేపట్నుంచే!

  Sat May 31, 2025 22:48        Politics

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పవన్ వివరించారు. గత ప్రభుత్వం పేదలకు రేషన్ సరుకులు అందించే చౌకధరల దుకాణాలను మూసివేసిందని పవన్ విమర్శించారు. "ఇంటింటికీ సరుకులు అందిస్తామని చెప్పి, రూ.1,600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారు.

 

ఇది కూడా చదవండి: చీకటిలోనూ చూడగలిగే... ఐడ్రాప్స్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు!

        

అయితే, ఇంటింటికీ ఇవ్వడం మానేసి, నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రధాన కూడళ్లలో వాహనాలు నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడ్డారు" అని ఆయన అన్నారు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకోవాల్సి వచ్చిందని, చిరుద్యోగాలు చేసుకునేవారు సెలవులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన రేషన్ బియ్యం, ఇతర సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని పవన్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖపట్నం ఓడరేవుల్లో పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకే, తిరిగి చౌకధరల దుకాణాల ద్వారానే పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త విధానంలో భాగంగా, దివ్యాంగులు మరియు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పేద ప్రజలకు సక్రమంగా, సకాలంలో నిత్యావసరాలు అందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ జైలుకుపోవడం మాత్రం పక్కా.. రెండు రోజుల క్రితం అనంతపురంలో..

 

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత.. ఈరోజు సాయంత్రం వరకు!

 

ఈరోజు ఉద‌యం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?

 

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

 

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #RationShops #June1 #GoodNews #APNews